తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా మిల్కీ బ్యూటీగా పేర్కొంది. దాదాపుగా తమన్నా సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చి 15 సంవత్సరాలు అవుతోంది. మొదట మంచు మనోజ్ హీరోగా వచ్చిన స్త్రీ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంటర్ ఇచ్చింది ఆ తర్వాత పలు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఇక మెగా హీరోల అందరితో నటించి రికార్డు ను సొంతం  చేసుకుంది  తమన్నా. ఇక వీరు మాత్రమే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది. ఒకవైపు సినిమాలతో, మరొకవైపు వెబ్ సిరీస్ లతో, ఐటెం సాంగులలో నటించి మెప్పించింది.

ఇక ప్రస్తుతం తన కెరియర్ ఎండింగ్ స్టేజ్ కి చేరుకుందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే తనకు వచ్చిన అవకాశాన్ని సైతం సై అంటోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే మరొకవైపు గుల్లుగోపురాలు, శక్తి పీఠాలు అంటూ పలు ప్రదేశాలను సందర్శిస్తూ ఉన్నది. తన తోటి హీరోయిన్లు సమంత నయనతార ఈ దేవాలయాలను సందర్శించడంలో తమన్నాకి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు తమన్నా పెళ్లి గురించి ఎక్కడ ఏ వార్త  వినిపించలేదు. కేవలం తమన్నా షూటింగ్ సమయాలలో కాస్త విరామం దొరకగానే ఆలయాలకు వెళ్లి దర్శించుకుంటూ వస్తోంది. ఇటీవల తాజాగా హిమాలయాల ప్రాంతాలను కూడా చూసి వచ్చింది.

జమ్ము లో  మాత వైష్ణవి దేవి ఆలయం చూసిన తమన్నా   అమ్మవారిని దర్శించుకోవడం ఒక గొప్ప అనుభూతి ఉత్సాహాన్ని కలిగించిందని తెలియజేస్తోంది. దీనితో పాటు ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవుని కూడా దర్శించుకున్న వీడియోను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తమన్న. ఇక ఈ వీడియోలో యోగి మైదానంలో తన మూడు రోజులపాటు తన జీవితంలో కొన్ని మధురమైన గా తమన్నా. తనకు ఆరోగ్యపరంగా కూడా పలు మంచి జరిగిందని తెలియజేసింది. తమన్నా ప్రస్తుతం చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: