అక్కినేని నాగార్జున హీరో గా ఇప్పుడు ది ఘోస్ట్ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 5 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. నాగార్జున నటించిన గత చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా అలరించకపోవడంతో ఈ సినిమా తప్పకుండా భారీగా ఆకట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే నాగార్జున ఓ సింపుల్ స్టోరీ తో కాకుండా ఓ మంచి యాక్షన్ భరితమైన సినిమా తో రావడానికి సిద్ధమయ్యాడు.

దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇలాంటి సినిమాలను ఎలా డీల్ చేస్తాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయన గత సినిమా గరుడ వేగా సినిమా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టింది. దర్శకుడిగా ఆయనకు ఎంత మంచి పేరు తెచ్చిందో అందరికి తెలిసిందే. అలాంటి దర్శకుడితో సినిమా చేస్తున్న నాగార్జున తప్పకుండా ఈ సినిమా తో హిట్ అందుకోవడం ఖాయం అన్నట్లుగానే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ లు అన్నీ కూడా సినిమా పై అంచనాలు భారీ స్థాయి లో పెంచాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అన్నట్లు అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా విడుదల సమయానికి మరో పెద్ద హీరో వెళ్లడం అందరిని ఈ పోటీ ఎంతో ఆసక్తి పరుస్తుంది.  మెగాస్టార్ చిరంజీవి హీరో గా పలు సినిమాలు రూపొందాయి. వాటిలో మొదటగా గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దసరా కి ఈ సినిమా విడుదల కాబోతుంది. డేట్ ఇప్పటివరకైతే ప్రకటించలేదు కానీ దసరా కి రావడం ఖాయం. దాంతో ఇప్పుడు నాగార్జున కి, చిరంజీవి కి మధ్య పోటీ తీవ్రస్థాయి లో ఏర్పడుతుంది అని చెప్పొచ్చు. గతంలో వీరు చాలాసార్లు పోటీపడ్డా ఇప్పుడు ఎంతో ప్రత్యేకం అని చెప్పొచ్చు. మరి రెండు భారీ సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి. గాడ్ ఫాదర్ సినిమా ను మలయాళం లో రూపొందిన లూసిఫర్ సినిమా కి రీమేక్ గా మోహన్ రాజా రూపొందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: