రజినీకాంత్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన "దళపతి" సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది."దళపతి" తరువాత దాదాపు 30 ఏళ్ల తర్వాత  రజినీకాంత్ మణిరత్నం కాంబో కి రంగం సిద్దం అవుతోందా? సూపర్ స్టార్ తో మణి సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి.వాళ్లిద్దర్నీ లైకా ప్రొడక్షన్స్ కలుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే లైకా సంస్థలో రజనీ రెండు సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అందులో ఒక చిత్రాన్ని శిబి చక్రవర్తి తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండవ సినిమా బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? అని సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఇప్పుడా స్థానంలోకి మణిరత్నం వచ్చి చేరుతున్నారు.లైకా సంస్థ రజనీతో సినిమా చేయాల్సిందని కోరగా అందుకు ఆయన వెంటనే ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ విషయం రజనీ కి చెప్పగా ఆయన కూడా అంతే ఉత్సాహంగా మళ్లీ 'దళపతి'తో సినిమానా? అంటూ సంతోషం వ్యక్తం చేశారట. 


ఇటీవలే మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్' మొదటి భాగం రిలీజ్ అయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ చిత్రాన్ని లైకా సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. రిలీజ్ తర్వాత ఊహించని లాభాలు వచ్చాయి. దీంతో మణిరత్నం రెండవ భాగం పనుల్లో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో రజనీ సినిమా విషయం మణిరత్నం వద్ద ప్రస్తావించడం ఆయన ఒప్పుకోవడం జరిగినట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాని పీఎస్-2 కంటే ముందే ప్రారంభించాలని లైకా భావిస్తోందిట.పీఎస్-2 షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని...ఈ నేపథ్యంలో అంతకుముందే రజనీతో సినిమా చేస్తే బాగుంటుంది అన్న ప్రపోజల్ ని మణిరత్నం ముందుకు తీసుకెళ్లినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ అనేది రావాల్సి ఉంది.మరి చూడాలి రెండోసారి ఈ కాంబో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: