లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ మూవీ లో కమల్ హాసన్ హీరో గా నటించిన మాత్రమే కాకుండా , ఈ మూవీ ని నిర్మించాడు.  ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ,  ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు కూడా లభించాయి. దానితో విక్రమ్ సినిమా ద్వారా కమల్ హాసన్ కు అద్భుతమైన లాభాలు కూడా వచ్చాయి. విక్రమ్ మూవీ అద్భుతమైన విజయం సాధించి , అద్భుతమైన లాభాలను తెచ్చి పెట్టడంతో కమల్ హాసన్ తన బ్యానర్ లో భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కమల్ హాసన్ కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినా కార్తీ తో తన బ్యానర్ లో ఒక మూవీ ని చేయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

కార్తీ హీరోగా కమల్ హాసన్ నిర్మాత గా తెరకెక్కబోయే మూవీ కి తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు ఉన్న దర్శకులలో ఒకరు అయిన లోకేష్ కనకరాజు దర్శికత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే లోకేష్ కనకరాజ్ ,  దళపతి విజయ్ తో ఒక మూవీ ని చేయడానికి కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. దళపతి విజయ్ ,  లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ పూర్తి అయిన తర్వాత కార్తీ హీరోగా కమల్ హాసన్ నిర్మాత గా లోకేష్ కానక రాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కార్తీ మరియు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఖైదీ మూవీ తెరకెక్కి బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: