తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట హీరోయిన్గా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన నటి ప్రగతి గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె ఎన్నో సినిమాలలో అక్క, అమ్మ ,చెల్లి పాత్రలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. ఇటీవల కాలంలో నటించిన చిత్రాలను ఈమెకు మంచి పాపులారిటీ తెచ్చి పెట్టేలా చేశాయి. సోషల్ మీడియాలో జిమ్ వర్కౌట్ వీడియోలు, యోగ వీడియోలు వంటివి పోస్ట్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది ప్రగతి. ప్రగతి జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


నటి ప్రగతి డ్రీమ్ కేవలం నటిగానే కాదట. హీరోయిన్గా ఒక వెలుగు వెలగాలని ఇండస్ట్రీలోకి వచ్చానని తెలియజేసింది. మోడలింగ్ నుంచి నటిగా మేకప్ వేసుకున్నానని ఈ క్రమంలోని తమిళ నటుడు భాగ్యరాజ్ సరసన నటించే అవకాశం వచ్చిందట. ఆ సమయంలో తమిళంలో పాటు మలయాళం లో పలు అవకాశాలు రావడంతో మొత్తంగా 7 చిత్రాలలో నటించానని తెలిపింది. అలాంటి సమయంలో ఒక హీరో తనని అసభ్యంగా మాట్లాడడంతో హీరోయిన్గా మళ్లీ నటించకూడదని ఆ తరహా పాత్రలవైపు మళ్ళీ తిరిగి చూడలేదని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది ప్రగతి.


అలాగే లాక్ డౌన్ సమయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురైందని తెలియజేసింది. కోవిడ్ సమయంలో షూటింగ్ లేవు దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని ఇంట్లో బంగారం తీసుకువెళ్లి అమ్మేశానని ఆ సమయంలో ఆ నగలు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలియజేసింది. నగలు లేకపోతే తిండి కూడా తినలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపింది ప్రగతి. ఆ రోజులు గుర్తు చేసుకుంటే చాలా భయంకరంగా ఉన్నాయని అలాగే ప్రగతి ఫ్యామిలీ లైఫ్ విషయంలోకి వస్తే తన దాంపత్య జీవితం సాఫీగా సాగాలని ఎంతో ప్రయత్నించాను కానీ ఎలాంటి ఫలితం లేదు. అందుచేతనే తన భర్తతో విడాకులు తీసుకున్నానని తెలియజేసింది. ప్రస్తుతం ప్రగతి గురించి ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: