బాలీవుడ్ ఇండస్ట్రీ కరోనా తర్వాత ఎంతో కొంత కలెక్షన్ లను రాబట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే అది అయాన్ ముఖర్జీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన "బ్రహ్మాస్త్ర" అని చెప్పాలి. ఈ సినిమా ముందు వరకు టాలీవుడ్ , శాండిల్ వుడ్ నుండి సినిమాలు బాలీవుడ్ లో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ లు అందుకున్నాయి. ఒక దశలో బాలీవుడ్ ప్రముఖులు సౌత్ ఇండస్ట్రీ పై విమర్శలు చేశారు. అలా గత నెలలో విడుదలను బ్రహ్మాస్త్ర మాత్రం విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్ లను రాబట్టింది. మొత్తానికి సోసోగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సెగ నుండి బయటపడింది. ఈ సినిమా హిందుత్వ అస్త్రాలపై చిత్రీకరించబడింది.

బ్రహ్మాస్త్రలో రణ్ బీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు హీరో హీరోనే లుగా నటించగా, అమితాబ్ బచ్చన్ , షారుఖ్ ఖాన్, నాగార్జున మరియు మౌనీ రాయ్ లు కీలకపాత్రలు పోషించారు. చివర్లో చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించారు. ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ ఆధారంగా  తెరకెక్కించిందే అయినా విజువల్స్ పరంగా ఆకట్టుకోలేదు అని కామెంట్స్ వచ్చాయి. కాగా ఈ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కించే పనిలో ఉన్నారట దర్శకుడు అయాన్ ముఖర్జీ. అయితే బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సెకండ్ పార్ట్ లో టాలీవుడ్ విలక్షణ నటుడు సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటించనున్నారట.

మొన్ననే గాడ్ ఫాదర్ తో విలన్ గా చేసి ఆకట్టుకున్నాడు సత్యదేవ్ మరియు ఈ వారంలో బాలీవుడ్ లోనూ రామ్ సేతు మూవీతో అక్షయ్ కుమార్ తో కలిసి నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా ఫెయిల్ అయినా సత్యదేవ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ బజ్ ను కరణ్ జోహార్ బ్రహ్మాస్త్ర 2 లో నటింపచేయాలని ప్లాన్ లో ఉన్నారట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే అటు సత్యదేవ్ లేదా కరణ్ జోహార్ అధికారిక ప్రకటన చేసే వరకు ఆగాల్సిందే.  









మరింత సమాచారం తెలుసుకోండి: