ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే బుల్లితెర కార్యక్రమాలు ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటాయి. ఎప్పుడు సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ఉంటాయని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఏకంగా సోషల్ మీడియాలో జబర్దస్త్ కమెడియన్స్ యాంకర్లకు సంబంధించిన ట్రోల్స్ ని కూడా ఇక ఆయా షోలలో స్క్రీన్ మీద చూపించడం.. ఇక ఆ ట్రోల్స్ పై సెలబ్రిటీల స్పందన ఏంటి అన్న విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేయడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇక ఇటీవలే ఇలాంటి ప్రయత్నమే చేసి ఏకంగా యాంకర్ రష్మీ గురించి ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టి అందరూ చర్చించుకునేలా చేశారు  మల్లెమాల యాజమాన్యం. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.. అయితే సుధీర్ వెళ్లిపోయిన తర్వాత ఇక యాంకరింగ్ బాధ్యతలను జబర్దస్త్ యాంకర్ రష్మీ తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే విడుదలైన ప్రోమోలో భాగంగా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలను స్క్రీన్ మీద చూపిస్తే అందుకు ఇక సెలబ్రిటీలు సమాధానం చెప్పారు.


 ఈ క్రమంలోనే యాంకర్ రష్మీకి సంబంధించిన ఒక ప్రశ్న స్క్రీన్ మీద చూపించగా.. ఈ ప్రశ్న చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటో తెలుసా ఏకంగా రష్మీకి ఒక హీరో విల్లా గిఫ్ట్ గా ఇచ్చాడట.. ఇది నిజమేనా అని. అయితే ఇక ఈ ప్రశ్న స్క్రీన్ మీద చూపించగానే జడ్జిగా ఉన్న ఇంద్రజహీరో ఎవరు రష్మీ అంటూ ముఖం మీద అడిగేస్తుంది. ఇక ఆ తర్వాత రష్మీ ఇక ఈ ప్రశ్నపై సమాధానం చెబుతుంది అని చెప్పాలి. దీంతో రష్మీ సమాధానం ఏంటా అని అందరూ ఆసక్తిగా చూస్తున్న సమయంలో ఇక రష్మీ చెప్పిన సమాధానాన్ని మ్యూట్ చేసి ప్రేక్షకులలో మరింత ఆత్రుతను పెంచేశారు. కాగా రష్మీ ఏం చెప్పిందో తెలియాలంటే మాత్రం ఫుల్ ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: