తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్న వారిలో ఒకరు అయినటు వంటి పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి దర్శకుడి గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ హీరో గా అనన్య పాండే హీరోయిన్ గ తెరకెక్కిన లైగర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పూరి జగన్నాథ్ తన తదుపరి మూవీ కి సంబంధించిన పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం పూరి జగన్నాథ్ , మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయడానికి కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక కథను సిద్ధం చేయడానికి పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన బృందం తో కథపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే పూరి జగన్నాథ్ , మెగాస్టార్ చిరంజీవి కోసం ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీ ని రాస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ "ఆటో జానీ" అనే పేరుతో మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ ఆగిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: