ఉప్పెన చిత్రంతో భారీ విజయాన్ని అందుకొన్న బుచ్చి బాబు సనా తన రెండో చిత్రం కోసం ఏడాదికి పైగా నే ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో ఓ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయాలని ప్లాన్ కూడా చేశాడు.

ఆ సినిమాకు ఎన్టీఆర్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం కూడా జరిగింది. ఎన్టీఆర్ rrr సినిమా తో బిజీగా ఉండటంతో ఎదురు చూశాడనే కథనా లు కూడా మీడియా లో అయితే కనిపించాయి.

అయితే చివరకు ఎన్టీఆర్‌ తో ప్రాజెక్ట్ వర్కవుట్ కాకపోవడంతో మరికొంత కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ ఒకే చెప్పడం తో బుచ్చిబాబు సినిమా పట్టాలెక్కేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమా కు సంబంధించిన అప్‌డేట్స్, రూమర్లు అభిమానులకు మరింత కిక్కునిచ్చేస్తున్నాయటా.. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం రాంచరణ్ తన కెరీర్‌ లో 15 వ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో చేస్తున్నాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తున్నది. ఈ సినిమా శరవేగం గా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ సినిమా తర్వాత రాంచరణ్, బుచ్చిబాబు సినిమా సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తున్నది.

రాంచరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌ లో వస్తున్న ఇంకా పేరుపెట్టని సినిమాకు వెంకట సతీష్ కిలారు నిర్మాత గా అయితే వ్యవహరించబోతున్నారు. కబాడ్డీ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కి ఈ చిత్రాన్ని జనవరి లో షూట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నార ని తెలుస్తుంది.

పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కే ఈ సినిమా ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమా ను సుమారు 300 కోట్ల బడ్జెట్‌ తో నిర్మించేందుకు వెంకట సతీష్ కిలారు రెడీ అవుతున్నట్టు కూడా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: