మన్మధుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమా పేరు చెప్తే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు ఈ సినిమాలో నటించిన హీరోయిన్ అన్షు అంబానీ.ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ ను పొందింది ఈమె. ఈ సినిమాలో తన నటనతో అందంతో అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది ఈమె. ఈ సినిమా అనంతరం ఏకంగా ప్రభాస సినిమాలోని నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈమె. రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకుంది ఈమె. ఇక ఈ రెండు సినిమాలతో వరుస సినిమాలలో నటించే అవకాశాన్ని పొందింది అన్షు అంబానీ.

 ఇక ఆ రెండు సినిమాల తర్వాత జై అనే ఒక తమిళ సినిమాలో కూడా ఈమె నటించింది. అయితే వరుస సినిమాలతో దోసుకుపోతుంది అనుకున్న సమయంలోనే ఒక్కసారిగా బ్రేక్ ఇచ్చింది అన్షు అంబానీ. దాని అనంతరం 2004లో వచ్చిన జై సినిమా తరువాత ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా కనిపించలేదు. ఈమె అయితే 2003లో రాఘవేంద్ర సినిమా చేసిన అనంతరం లండన్ కు చెందిన సచిన్ సాగర్ అని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది అన్షు అంబానీ. ప్రస్తుతం ఈమె లండన్ తో తన భర్తతో కలిసి ఉంటుంది. ప్రస్తుతం ఈమెకి ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు. 

అయితే ప్రస్తుతం అన్షు అంబానీ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది .సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఒక క్లాతింగ్ బిజినెస్ను చేస్తోంది ఈమె. అయితే తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈమె తన భర్త మరియు పిల్లలతో కలిసి చాలా సరదాగా గడిపిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దాంతోపాటు తన భర్త బర్త్డే పార్టీలో మెరిసింది ఈమె. ఇక తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఆ ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి .సినిమాలకు దూరమై ఇన్నాళ్లు కావస్తున్నప్పటికీ అప్పుడున్న అందమే ఇప్పటికీ ఈ హీరోయిన్ లో ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: