నందమూరి బాలకృష్ణ మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి రేపు రిలీజ్ కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. నవీన్ యెర్నేని , వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన మీడియాతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ..బాలకృష్ణ గారితో నేను చేసిన ఆఖండ సినిమాతో వీరసింహారెడ్డి సినిమాకి అసలు పోలిక ఉండదు. ఈ సినిమా మొత్తం కల్ట్ సినిమా.. ఈ సినిమాలో ఎమోషన్స్.. 

సిస్టర్ సెంటిమెంట్.. అలాగే అందరికీ ఎంతో నచ్చే బాలకృష్ణ గారి మాస్ ఇలా అన్ని అంశాలతో కూడి ఈ సినిమా ఉంటుంది. అంతేకాదు ఒక దర్శకుడు మంచి సినిమా తీస్తేనే నేను ఇప్పుడు ఒక మంచి మ్యూజిక్ ఇవ్వగలను. ఒక సినిమాకి దర్శకుడు పునాది.. ఆ సినిమా దర్శకుడు ఒక డైరెక్టర్ గా కాకుండా బాలకృష్ణ గారి అభిమానిగా గోపీచంద్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు.. ఇక ఈ కారణంగానే ఈ సినిమాకి మంచి సంగీతాన్ని ఇచ్చే అవకాశం నాకు దక్కింది.. సినిమాలో కచ్చితంగా అభిమానులు ఏమి కోరుకుంటారో అది ఇవ్వడం మాత్రమే నా పని.. ఇక ఈ సినిమాలో జై బాలయ్య సుగుణసుందరి..

మాస్ మొగుడు.. ఈ పాటలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి.. గత ఏడాది బాలకృష్ణ నటించిన అఖండా సినిమాలో మ్యూజిక్ కి థియేటర్లలో స్పీకర్లు పగిలిపోయాయి.. కచ్చితంగా ఈ సినిమాకి కూడా థియేటర్లలో స్పీకర్లు పగులుతాయి జాగ్రత్తగా ఉండండి అని ముందే చెప్తున్నాను.. సాధారణంగా బాలకృష్ణ గారిని చూస్తేనే ఎక్కువగా మ్యూజిక్ ని వాయించేయాలి అని అనిపిస్తుంది.. సెకండ్ హాఫ్ తర్వాత నాలుగు పాటలు నాలుగు ఫైట్లతో అదరగొట్టే సినిమా ఇది.. ఈ సినిమా చూస్తూ మీకు అసలు పాప్కాన్ తినే సమయం కూడా ఉండదు ..అంటూ చెప్పుకొచ్చాడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: