దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి తాను నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను ముగించుకొని ఇటీవల హైదరాబాద్ కి చేరుకున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు అమెరికాతోపాటు ఇతర దేశాలలో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తెగ తిరిగేసిన రాజమౌళి ఇప్పుడు పూర్తిగా విశ్రాంతి మోడ్ లో ఉన్నట్లు తాజా సమాచారం అందుతుంది. ఇకపోతే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని హీరో మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు..

కానీ పరిస్థితులు చూస్తుంటే రాజమౌళి నుండి ఈ సంవత్సరంలో ఒక చిన్న అప్డేట్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు.  ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబు సినిమా కోసం కథను రెడీ చేసినట్లుగా ఆయనే స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే ఒక విభిన్నమైన కథతో మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు గతంలో కూడా ఆయన తెలిపారు.. విజయేంద్రప్రసాద్ సిద్ధం చేసిన ఆ స్టోరీ లైన్ కి దర్శకుడు రాజమౌళి ఫినిషింగ్ టచ్ చేస్తే షూటింగ్ కి వెళ్లిపోవడమే తరువాయి అన్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి అంతేకాదు స్క్రిప్ట్ వర్క్ కి కనీసం ఏడాది సమయం అయిన పట్టే అవకాశం ఉంది.  కాబట్టి వచ్చే సంవత్సరం వరకు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వచ్చే షూటింగ్ కోసం ఎదురు చూడాల్సిందే.

ఒకవేళ అదే నిజమైతే ఈ సినిమా 2025లో అయినా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు అభిమానులలో వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం రాజమౌళి ఏం చేస్తున్నాడు అనే విషయం తెలియక ప్రతి ఒక్కరూ సతమతమవుతున్నారు. ఇకపోతే రాజమౌళి నోటు నోటు పాటకి ఆస్కార్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ కూడా నెలకొంది వచ్చే నెల ఆస్కార్ వచ్చేది లేనిది క్లారిటీ వస్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: