తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న ప్రభాస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ప్రభాస్ ప్రస్తుతం 5 పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు అన్నిటికీ కూడా వరుసగా షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఇటీవలే ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. గడిచిన కొద్ది రోజుల క్రితం ఈ సినిమా టీజర్ను విడుదల చేయక మిశ్రమ స్పందన రావడంతో.. డైరెక్టర్ ఓం రౌత్ VFX ను మరింత మెరుగుపరిచేందుకు కాస్త సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఇక వీటితోపాటు సలార్, డైరెక్టర్ మారుతీ తో మరొక సినిమా, స్పిరిట్, ప్రాజెక్టుకే వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఇక ఈ సినిమా షూటింగులు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే గత మూడు రోజుల నుంచి ప్రభాస్ ఆరోగ్యం పైన పలు రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో కూడా ఒకసారి ప్రభాస్ ఆరోగ్యం పైన పలు రూమర్సు వినిపించగా ఇలాగే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ ప్రభాస్ ఆరోగ్యం నిన్నటి రోజు రాత్రి నుంచి చాలా క్షీణించిందని మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్ళబోతున్నారని ప్రభాస్ సన్నిహితుల నుంచి ఈ వార్తలు వినిపిస్తున్నాయని ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

అయితే అభిమానులు మాత్రం ఈ విషయాన్ని అసలు నమ్మలేదు.. ఎందుకంటే టాలీవుడ్ మీడియా మాత్రం ఈ విషయం పైన అసలు ఫోకస్ చేయలేదు కేవలం బాలీవుడ్ మీడియాలో మాత్రమే ఈ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకోసమే ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నిటినీకి కూడా బ్రేక్ ఇచ్చినట్లుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమా లేక అబద్ధమా అనే సందేహాలు కూడా వెలుబడుతున్నాయి అభిమానులలో ఏది ఏమైనా ప్రభాస్ పైన బాలీవుడ్ మీడియా కుట్రపూరితంగానే ఇలాంటి విషయాలను చేస్తున్నాదని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై ప్రభాస్ టీం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: