సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన కథను మరో హీరో చేసి సూపర్ హిట్ కొట్టడం జరుగుతూ ఉంటుంది. కేవలం సినిమా స్టోరీలో మాత్రమే కాదు ఇక సినిమాలోని పాత్రల విషయంలో కూడా కొన్ని కొన్ని సార్లు ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ మహర్షి విషయంలో కూడా ఇలాంటిదే జరిగిందంట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.



 ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది. అయితే ఒక కీలకమైన పాత్రలో మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ నటించాడు. అప్పటి వరకు కేవలం కామెడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేసిన అల్లరి నరేష్.. మహర్షి సినిమాలో మాత్రం సరికొత్తగా ప్రేక్షకులను పలకరించాడు. 2019లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాతోనే అల్లరి నరేష్ కెరీర్ కూడా మలుపు తిరిగింది. ఇక ఇప్పుడు కామెడీ చిత్రాలకు స్వస్తి పలికి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు అల్లరి నరేష్.



 అయితే మహర్షి సినిమాలో అల్లరి నరేష్ నటించిన పాత్ర కోసం వంశీ పైడిపల్లి ముందుగా మరో హీరోని అనుకున్నాడట. ఇక ఆ హీరోతో చర్చలు కూడా జరిపాడట. ఆ హీరో ఎవరో కాదు మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ అన్నది తెలుస్తుంది. అయితే ఇక సాయి ధరంతేజ్ మాత్రం ఈ పాత్రను రిజెక్ట్ చేశాడట. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సాయి ధరంతేజ్ కు ఈ అవకాశం ఇస్తే అతని కెరియర్ కు ఉపయోగపడుతుందని ఇలా ఆఫర్ చేశాడట దర్శకుడు. కానీ అతను రిజెక్ట్ చేయడంతో  ఇక తర్వాత మహర్షి సినిమాలో మహేష్ స్నేహితుడి పాత్ర కోసం అల్లరి నరేష్ ను సెలెక్ట్ చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి.

మరింత సమాచారం తెలుసుకోండి: