లోక నాయక కమలహాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడుగా, గాయకుడిగా, రచయితగా ఇలా పలు ముఖాలు  కలిగిన అరుదైన కళాకారుడు మన కమలహాసన్. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ వంటి భాషల్లో కూడా వరుస సినిమాలో చేసి ఎన్నో విజయాలను సాధించాడు కమలహాసన్.వీటితోపాటు అనేక రకాల కొత్త విషయాలను సినిమాలకు పరిచయం చేసిన ఘనత కూడా కమలహాసన్ కే. ఇప్పటికే కమలహాసన్ పలీజ్ భాషలో 232 సినిమాలకు పైగానే నటించాడు. 

ఇటీవల తన సొంత బ్యానర్ లో నిర్మించిన కమలహాసన్ కథానాయకుడిగా నటించిన విక్రమ్ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో మీ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కమలహాసన్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ టు సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఆయన 233వ సినిమా. ఇక ఈ సినిమా తర్వాత కమలహాసన్ తన తదుపరి 234వ సినిమాని మణిరత్నం దర్శకత్వంలో చేయడానికి రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా స్టార్ హీరో ధనుష్ ,శింబు, శివ కార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్నాడు కమలహాసన్.

 ఇదిలా ఉంటే ఇప్పటికే కమల్ హాసన్ ఆయన నటించిన చాలా సినిమాలకు పలు రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను అందుకోవడం జరిగింది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పద్మ విభీషణ్ వంటి అత్యున్నత అవార్డులను సైతం అందుకున్నాడు కమలహాసన్. ఇక అసలు విషయం ఏంటంటే తాజాగా కమలహాసన్ విశ్వ వేదికపై జీవిత సాఫల్య అవార్డును అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈనెల 27వ తేదీన అబుదాబిలో జరగబోతున్న అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్స వేడుకల్లో కమలహాసన్ కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రధానం చేయబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం కమలహాసన్ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: