తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోల చిత్రాలను సైతం రి రిలీజ్ చేస్తూ పలు రకాల రికార్డ్లను సైతం సృష్టిస్తున్నాయి. అలా ఇప్పటివరకు ఎంతో మంది హీరోల చిత్రాలు కూడా విడుదలయ్యాయి. కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈనెల 20వ తేదీన ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా సింహాద్రి చిత్రాన్ని 4k లో విడుదల చేయడం జరిగింది. మొదటి రోజు ఈ సినిమా కనెక్షన్లు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత రోజు నుంచి కలెక్షన్లు డ్రాప్ అయినట్టుగా తెలుస్తోంది.


ఈ చిత్రాన్ని రెండవ రోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ .20 లక్షల కంటే తక్కువ కలెక్షన్లను రాబట్టినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రం.. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ చిత్రాన్ని  రీ రిలీజ్ చేయగా రెండవ రోజు కూడా బాగానే కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కానీ..సింహాద్రి సినిమా మాత్రం రెండవ రోజుకి కలెక్షన్ల పరంగా డ్రాప్ అవ్వడంతో పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు టోటల్ కలెక్షన్లు గురించి పూర్తి వివరాలు  తెలియాలి అంటే చిత్ర బృందం ఈ విషయం పైన అధికారికంగా స్పందిస్తుందేమో చూడాలి మరి.


ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ని కూడా పెట్టడం జరిగింది. హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఎప్పటికప్పుడు అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. సింహాద్రి సినిమా విడుదలైన కొన్నిచోట్ల అభిమానులు పెద్ద ఎత్తున హంగామా చేయడంతో పాటు థియేటర్ యాజమాన్యాలకు కూడా చాలా ఇబ్బంది కలిగించేలా చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో రీ  రిలీజ్ చిత్రాలను విడుదల చేసే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: