అనుష్క పశ్చిమ గోదావరి పోలవరం మధ్యలో ఉన్న మహా నందీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్నేహితులతో కలిసి ఆమె పడవలో ప్రయాణించి ఆలయానికి చేరుకున్నారు. తన కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే అనుష్క ఆ సమయంలో మాస్కు ధరించడంతో ఎవరూ ఆమెను గుర్తు పట్టలేదు.