మహిళ అంటే వంటింటి కుందేలు మాత్రమే అని ఉన్న భావానను పటా పంచలు చేస్తూ ఎంతో మంది మహిళలు తమలో ఉన్న వంట చేసే స్కిల్స్ తోనే యూట్యూబ్ వేదికగా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అంతేకాదు ఎన్నో కుకింగ్ షోస్ కి కూడా వెళ్తూ అక్కడ ఇక తమకు వచ్చిన వంటలు చేయడం ద్వారా పాపులారిటీ సంపాదించుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. ఇలా ఇటీవల కాలంలో రుచికరమైన వంటలు చేయడం నేర్చుకోవడం కూడా అటు ఒక ఇన్కమ్ లాంటిదే అని నిరూపిస్తున్నారు అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల కాలంలో ఎన్నో చానల్స్ మహిళలతో కుకింగ్ షోలను నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. మన ఇండియాలో మాస్టర్ చెఫ్ ఇండియా లాగానే పాకిస్తాన్లో కూడా కేఎం ద కిచెన్ మాస్టర్ అనే షోను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఇందులో పాల్గొని రుచికరమైన వంటలు చేసి జడ్జెస్ ను మెప్పించాల్సి ఉంటుంది. ఇక ఇలా మెప్పించిన వారికి ప్రైజ్ మనీ కూడా దక్కుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ షోలో ఒక మహిళ బిర్యాని తీసుకువచ్చి జడ్జెస్ ముందు పెట్టింది. ఈ షోలో వంటకాలను వండటమే కాదు వండిన పదార్థాలు ఎంతో అందంగా కనిపించేలా ప్లేట్లల్లో పెట్టి జడ్జిలకు ఇవ్వాల్సి ఉంటుంది.



 కానీ ఈ సదరు మహిళ మాత్రం నేరుగా ఒక బాక్స్ లో తీసుకువచ్చి జడ్జెస్కు అందజేసింది. దీంతో జడ్జెస్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటిది బిర్యానీ ఎందుకు ఇలా బాక్స్ లో తీసుకొచ్చావు. అందంగా ఎందుకు ప్రజెంట్ చేయలేదు అని జడ్జెస్ ప్రశ్నించారు. అయితే ఆమే చెప్పిన సమాధానంతో జడ్జెస్ దిమ్మతిరిగిపోయింది. నాకు రెస్టారెంట్ లో ఇలాగే ఇచ్చారు అంటూ సమాధానం చెప్పింది. స్వయంగా వండి ఫుడ్డు తీసుకురావాలి కానీ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తీసుకురావడం ఏంటి అంటూ జడ్జెస్  ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి ఆ బిర్యాని తీసుకొని వెళ్ళిపోమని ఆగ్రహం వ్యక్తం చేయగా.. మహిళా జడ్జెస్ తో వాదనకు దిగింది. ఇక ఇది కాస్త సంచలనగా మారిపోయిందిఅని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pak