
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహన దారులపై ఏకంగా ఛార్జిషీట్లు వేస్తాం అంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు. కరోనా రూల్స్ కారణంగా గ్యాప్ ఇచ్చామని ఇక ఇప్పుడు మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే మునుపటి లాగానే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతాం అంటూ చెప్పుకొచ్చారు రంగనాథ్. అయితే హైదరాబాద్ నగర వ్యాప్తం గా స్పీడ్ లిమిట్ ఒకే విధంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము అంటూ ట్రాఫిక్ జాయింట్ సి పి రంగనాథ్ చెప్పుకొచ్చారు. త్వరలో స్పీడ్ లిమిట్ విధానం కూడా అమల్లోకి వస్తుందని చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా అటు వాహనాల పై ఆంటీ స్టిక్కర్ అతికించే రాదని.. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తప్పని సరిగా పాటించాలని సూచించారు. ఇక నిబంధనలకు విరుద్ధం గా వాహనాలకు స్టిక్కర్లు వేసుకుని తిరిగితే మాత్రం ఉపేక్షించేది లేదని చర్యలు తప్పవని హెచ్చరించారు. కేవలం పోలీస్ శాఖ ఇచ్చిన స్టిక్కర్ మాత్రమే వాడాలని సూచించారు. ఇక రూల్స్ పాటించని వారిపై 177 మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. పోలీస్ హెచ్చరికల నేపథ్యం లో అటు వాహనదారులు అందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు అని చెప్పాలి.