కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం-పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వానికి మధ్య వివాదం అనేది మొదలైంది. ఈ మధ్యనే జరిగిన పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) క్లీన్ గా స్వీప్ సంగతి తెలిసిందే.117 అసెంబ్లీల్లో ఆప్ కు మొత్తం 92 సీట్లొచ్చాయి. ఆప్ ఇంతటి ఘన విజయం సాధించటాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తట్టుకోలేకపోతున్నది. అందుకనే పంజాబ్-హర్యానా ఉమ్మడి రాజధాని కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ విషయంలో వేలు పెట్టడం స్టార్ట్ చేసింది.చండీగఢ్ పాలనా విషయాల్లో కేంద్రం తలదూర్చటం ప్రారంభించింది. ఇక ఢిల్లోలో కూడా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఇబ్బంది పెట్టడానికి మోడీ ప్రభుత్వం చేయని ప్రయత్నం అనేది లేదు. ఏదో ఒక రూపంలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గబ్బుపట్టించటమే టార్గెట్ గా కేంద్రం పావులు కదుపుతునే ఉంది. ఇదే పద్ధతిలో ఇపుడు పంజాబ్ రాష్ట్రంలో గెలిచిన ఆప్ పై తన అక్కసును చూపుతోంది. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతమన్న ఏకైక కారణంతో పంజాబ్ రాష్ట్ర విషయంలో జోక్యం చేసుకుంటోంది.



ఈ విషయాలన్నింటినీ గమనించిన తర్వాతే తాజాగా పంజాబ్ అసెంబ్లీ చండీగఢ్ ని పూర్తిగా తమ రాష్ట్రానికే షిఫ్ట్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఉమ్మడి రాజధానిగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న చండీగఢ్ ను పంజాబ్ రాష్ట్రానికి మాత్రమే రాజధానిగా చేయాలంటు కేంద్రాన్ని పంజాబ్ అసెంబ్లీ డిమాండ్ చేయటంతో అక్కడ కొత్త వివాదం మొదలైంది. హర్యానాలో బీజేపీ ప్రభుత్వమే ఉన్న కారణంగా కేంద్రం యధేచ్చగా తనిష్టమొచ్చినట్లుగా నిర్ణయాలను తీసుకుంటోంది.ఇక దీన్ని గమనించిన తర్వాతే ఉమ్మడి రాజధానిగా చండీగఢ్ ను కంటిన్యూ చేయటం వల్ల ఎదురయ్యే సమస్యలు పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తావించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బీజేపీ మినహా కాంగ్రెస్ పార్టీ శిరోమణి అకాలీదళ్ ఎంఎల్ఏలు కూడా మద్దతు పలికారు. మొత్తానికి పంజాబ్-హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్ పై ఆప్ సర్కార్ లేవనెత్తిన కొత్త వివాదం భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అనేది ఇక చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: