ఇప్పుడు అంతా డిజిటల్ మయం అయ్యింది.. మనీ ట్రాన్సాక్షన్‌ చెయ్యాలంటే మాత్రం అందరు యూపీఐ లావాదేవీలు చేస్తున్నారు. ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌పే, అమెజాన్‌ పే వంటి ఎన్నో యాప్స్‌ అందుబాటులో కి వచ్చాయి. ఇదిలా ఉంటే ఆన్‌ లైన్‌ పేమెంట్స్‌ విషయంలో నూ కొన్ని పరిమితులు ఉన్నాయని మీకు తెలుసా. యూపీఐ సేవలు అందించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ట్రాన్సాక్షన్స్‌ విషయం లో కొన్ని నిబంధనలు విధించింది..


అసలు విషయాన్నికొస్తే.. యూపీఐ ద్వారా ఒక యూజర్‌ రోజు లో రూ. లక్ష వరకే పంపుకోగలరు. ఇది ఎన్‌పీసీఐ విధించించిన పరిమితి. అయితే బ్యాంకులు విడి విడిగా పరిమితు లు విధిస్తున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ యూజర్‌ రోజు లో రూ. లక్ష వరకు పంపుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇక కెనరా బ్యాంక్‌ విషయానికొస్తే రూ. 25,000 పరిమితిని విధించింది. ఇదిలా ఉంటే పాన్‌ కార్డు లేకపోతే కోన్ని బ్యాంకులు నెల మొత్తాని కి కూడా పరిమిత ట్రాన్సాక్షన్స్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి.


ఇదిలా ఉంటే రోజువా రి ట్రాన్సాక్షన్స్‌ విషయం లోనూ నిబంధనలు ఉన్నాయి. ఒక రోజులో గరిష్టంగా 20 యూపీఐ లావాదేవీల కంటే ఎక్కువ చేసుకునే అవకాశం లేదు.. అంతకు మించి ఒక్కటి కూడా పోదు.. ట్రాన్సాక్షన్‌ పెండింగ్ అని వస్తాయి.. ఈ పరిమితి మించితే మళ్లీ 24 గంటల వరకు వేచి చూడాల్సిందే. ఇక గూగుల్ పే ద్వారా రోజులో రూ. లక్షల వరకు పంపుకోవచ్చు. ట్రాన్సాక్షన్‌ పరిమితి రోజుకు 20 గా ఉంది. పేటీఎం లో కూడా గరిష్టంగా రూ. లక్ష వరకు పంపుకోవచ్చు. అయితే ఒక గంట లో కేవలం రూ. 20 వేల పరిమితి అమలు చేస్తోంది.. ఇది గుర్తుంచుకోండి.. లావాదేవీల పై లిమిట్ వుంటుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: