గతేడాది ఖరీఫ్ సీజన్లో కోటి ఎకరాలకు పైగా (1,00,44,463 ఎకరాల) ఆయకట్టుకు సాగునీరందించింది ప్రభుత్వం. రాష్ట్ర చరిత్రలో ఖరీఫ్లో కోటి ఎకరాలకు నీళ్లందించడం అదే ప్రథమం. ప్రస్తుత ఖరీఫ్లో 1,11,41,471 ఎకరాలకు నీళ్లందించడం ద్వారా గత రికార్డును తిరగరాసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా జలాలను ఒడిసి పట్టడం ద్వారా ఈ ఖరీఫ్లో 1.11 కోట్ల ఎకరాలకు సాగు నీరందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.