అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం టీడీపీకి పట్టున్న నియోజకవర్గం. ఒకప్పుడు ఇక్కడ కాంగ్రెస్కు తిరుగుండేది కాదు. కానీ టీడీపీ ఆవిర్భావించక పరిస్థితులు మారాయి. 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో శింగనమల నుంచి టీడీపీ 5 సార్లు విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ మూడుసార్లు గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ వేవ్లో టీడీపీ కంచుకోటలు కుప్పకూలాయి. ఇక శింగనమల సైతం వైసీపీ నుంచి పోటీ చేసిన జొన్నలగడ్డ పద్మావతి టీడీపీ నుంచి పోటీ చేసిన బండారు శ్రావణిపై భారీ మెజారిటీతో గెలిచారు.