ఫేస్ బుక్ ను ఎక్కువగా వాడుతున్నారా.. అయితే జాగ్రత్త .. కిలెడీలు ఎక్కవగా ఉన్నారని పోలీసులు హెచ్చరించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల కేంద్రానికి చెందిన గిన్నారపు నాగేందర్కు ఫేస్బుక్ ద్వారా లండన్కు చెందిన మెర్సీ జాన్సన్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య కాస్త చనువు పెరగడంతో నాగేందర్ ను మోసం చేసేందుకు యువతి ప్లాన్ వేసింది. ముందుగా 20 లక్షలు ఇస్తే మీకు రిటర్న్ గిఫ్ట్ గా 70 వేల పౌండ్ల డబ్బులు జమ అవుతాయని అంటుంది.తనకు రావాల్సిన నగదు రాకపోవడంతో మోస పోయానని తెలుసుకున్న నాగేందర్ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.