అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా కొంత అధికార గర్వంతో ముందుకు సాగుతుంది.. అందునా వైసీపీ పార్టీ కి ఆ గర్వం ఎక్కువే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు లాగా ముఖ్యమంత్రి పదవి లాక్కుంటే వచ్చింది కాదు కష్టపడితే వచ్చింది.. ప్రజలు నమ్మితే వచ్చింది. అలాంటి జగన్ ను టీడీపీ పార్టీ చాలా ఇబ్బంది పెడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లేవని చెప్పాలి.. ఏ రాష్త్రంలోనూ ముఖ్యమంత్రి ని ఇంతలా ఏ ప్రతిపక్షాలు టార్గెట్ చేయలేదు.. ప్రతి విషయంలో అధికార ప్రభుత్వాన్ని నిందిస్తూ, కోర్టు లో కేసులు వేసి గెలుస్తూ , అసలు ప్రభుత్వంలో ఉన్నది టీడీపీ నా, వైసీపీ నా అన్నది తెలీకుండా టీడీపీ ప్రవర్తిస్తుంది.. ఓ వైపు నేతలు జైలుకు వెళుతున్నా ఏమాత్రం తగ్గకుండా వైసీపీ ని విమర్శలపాలు చేస్తూ గుదిబండలా తయారైంది..