ఛానెల్స్ పై నిఘా పెట్టాలని ఎన్నికల కమీషన్ కు తెరాస నేతలు వినతి పత్రాన్ని అందించారు..నిన్నటి నుంచి టీఆరెఎస్ కు వ్యతిరేకంగా ఛానెల్స్ ప్రచారం చేస్తున్నాయని వినతి పత్రంలో పేర్కొన్నారు..రాజ్న్యూస్ ఛానల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు ఛానల్పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోను భరత్కుమార్, కల్యాణ్రావు, రాము తదితరులు పాల్గొన్నారు.