పుంగనూరులో పర్యటించేందుకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్న రాత్రి పుంగనూరు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు పుంగనూరులో ఆయన పర్యటించాల్సి ఉంది. మూడో విడత పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవ లను ఆయన పరిశీలించాలని అక్కడికి వెళ్లారు..అయితే పర్యటనకు ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం అధికారులు పోలీసులను కోరడంతో పోలీసులు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశం ఉందన్న పోలీసులు ఏర్పాటు చేయలేమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కోర్టు తీర్పుతో పుంగనూరు లో పర్యటించి ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పోలీసులకు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.