2019 ఎన్నికల్లో జనసేన వల్ల ఎక్కువ లాభం జరిగింది వైసీపీకే. జనసేన ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి భారీగా నష్టం జరిగింది. అదే సమయంలో వైసీపీకి లాభం చేకూరింది. చాలా నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల వైసీపీ ఎమ్మెల్యేల గెలుపు సులువైంది. అలా జనసేన ప్రభావంతో గెలిచిన ఎమ్మెల్యేల్లో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కూడా ఒకరు.