రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగులతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.దీంతో టెస్టు
క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాపై 3-0తో సిరిస్ను గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. దీంతో భారత క్రికెట్ జట్టును చూస్తుంటే ఓడించడం ఏ జట్టుకైనా అంత వీజీ కాదని అర్ధం అయ్యుంది దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్కి. అజహరుద్దీన్ నాయకత్వంలోని టీమిండియా రెండు సిరిస్లను వైట్ వాష్ చేయగా... విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మూడు సార్లు ప్రత్యర్ధి జట్లను వైట్వాష్ చేసింది.
ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా 3-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేయగా... దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో నాల్గో అతిపెద్ద పరాజయాన్ని చవిచూశారు సఫారీలు. ఫలితంగా సఫారీలపై తొలిసారి క్లీన్స్వీప్ చేసి ఓ అరుదైన రికార్డుని నెలకొల్పారు భారత జట్టు. దక్షిణాఫ్రికా జట్టుపై కెప్టెన్గా విరాట్ కోహ్లీకి ఇదే తొలి వైట్వాష్ సిరిస్ కావడం విశేషం.మ్యాచ్ తరువాత డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘ విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా చాలా బలంగా ఉంది. ఆ జట్టును ఓడించడం చాలా కష్టం.
బ్యాటింగ్, బౌలింగ్లతో పాటు ఫీల్డింగ్ల్లో కూడా భారత జట్టు మామూలుగా లేదు. ఈ పర్యటన మాకు కఠినతరంగా మారింది. మళ్లీ భారత్కు రాబోయే పర్యటన నాటికి మా జట్టు రాటుదేలాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈ సిరీస్లో భారత సీమర్లు ఇరగదీశారు. టీమిండియా పేసర్లతో మా సీమర్లు పోటీపడలేకపోయారు. ఇది వాస్తవం. మా వాళ్లు తొలి 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే ప్రభావం చూపితే, భారత సీమర్లు మాత్రం రోజంతా తమ వాడిని కొనసాగిస్తున్నారు. దాంతోనే మేము సిరీస్ను ఘోరంగా కోల్పోయాం.
భారత బ్యాటింగ్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాం.. అదే సమయంలో భారత బౌలర్లను ప్రతిఘటించలేకపోయాం కూడా’ అని డుప్లెసిస్ మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పుకొచ్చాడు. ఇక తమ జట్టులోని యువ ఆటగాళ్లు రాబోవు 3 నుంచి 4 ఏళ్లలో రాటుదేలతారని ఆశాభావం వ్యక్తం చేశాడు.