యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సురేష్ రైనా కి బదులుగా రాబిన్ ఊతప్పనే బరిలోకి దింపే అవకాశం ఉంది. అయితే ఈ సీజన్ లో రైనా అలాగే చెన్నై కెప్టెన్ ధోని బ్యాటింగ్ లో విఫలమవుతున్నారు. అదే ఆ జట్టుకు ఓ సమస్యగా మారిన విషయం తెలిసిందే. అయితే కెప్టెన్ గా కీపర్ గా ధోని జట్టులో ఉండాల్సిందే కాబట్టి రైనా స్థానాన్ని రాబిన్ ఊతప్ప భర్తీచేయాలని చెన్నై సూపర్ కింగ్స్ చూస్తుంది. ఇక ఆ జట్టు ఆల్ రౌండర్ సామ్ కర్రన్ గాయం కారణంగా ఈ సీజన్ నుండి తప్పుకోవడం చెన్నైకి కొంత నష్టమే. అయితే అతని స్థానాన్ని డ్వేన్ బ్రావో భర్తీ చేస్తాడు అనే ఆలోచనలు చెన్నై ఉంది. అలాగే ఆల్ రౌండర్ గా జడేజా అదరకొడుతున్నాడు. అలాగే బౌలింగ్ లోని బ్రావోకు తోడు దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్ రాణిస్తున్నారు,

ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ఐదు విజయాలతో 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది పంజాబ్ జట్టు. కానీ ఆ జట్టులో నిలకడ లేకపోవడమే వారిని కలవరపెడుతోంది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ 528 పరుగులతో ఈ సీజన్లో మొదటి స్థానంలో ఉండగా... మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 429 పరుగులతో ఉన్నాడు. కానీ మిగిలిన వారు ఎవరు రాణించక పోవడమే ఆ జట్టు కష్టాలకు ఒక కారణం. ఇక బౌలింగ్ లో మొహమ్మద్ షమీ. అర్ష్‌దీప్ సింగ్ అదరగొడుతున్నారు. అలాగే కీలకమైన సమయంలో రవి బిష్ణోయ్ కూడా రాణిస్తున్నాడు. అయితే ఈ రెండు జట్ల గత గత మ్యాచ్ ల ప్రదర్శన చూస్తే ఎవరు విజయం సాధిస్తారు అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే గత రెండు మ్యాచ్ లో ఓడిపోయిన చెన్నై ప్రస్తుతం పంజాబ్ జట్టు లాగే కొంత వెనుకబడి ఉంది. కాబట్టి ఇందులో ఎవరు విజయం సాధిస్తారు అనేది మ్యాచ్ అనంతరమె తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: