ఇకపోతే ఇటీవల కేఎల్ రాహుల్ కు సొంతగడ్డపై సౌత్ ఆఫ్రికా జట్టు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. కానీ చివరికి గజ్జల్లో గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఇటీవలే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియమ్ లో సౌత్ ఆఫ్రికా తో మొదటి టి20 మ్యాచ్ ఆడింది భారత జట్టు. కాగా మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియాకు ఘోర పరాభవం తప్పలేదు అని చెప్పాలి. బ్యాటింగ్ లో టీమిండియా పరవాలేదు అనిపించినా బౌలింగులో మాత్రం పూర్తిగా విఫలమైంది.
సొంతగడ్డపై కూడా ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించడంలో విఫలమైంది. గతంలోనే మొదటి టి20 మ్యాచ్ లో ఓడిపోయింది. అయితే ఇక సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో రిషబ్ పంత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. కీలక బౌలర్ గా కొనసాగుతున్న చాహల్ తో రెండు ఓవర్లు మాత్రమే వేయించడం ఆశ్చర్యాన్ని కలిగించింది అంటూ చెప్పుకొచ్చాడు. డసేన్ క్రీజులో ఉన్నప్పుడు చాహల్ తో బౌలింగ్ చేయాల్సింది. కానీ అక్షర పటేల్ కు బౌలింగ్ ఇచ్చారు. అదే సమయంలో డేవిడ్ మిల్లర్ సిక్సర్లు కొడుతున్నప్పుడు అయినా చాహల్ కు బౌలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది అతడు పురుగులు కంట్రోల్ చేసే వాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆశిష్ స్నేహ..