ఎందుకంటే ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్కప్ లో భాగంగా విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు టీం ఇండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లగా రోహిత్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ప్రకటించింది టీమిండియా యాజమాన్యం. ఈ క్రమంలోనే ఈ విశ్రాంతి సమయాన్ని ఎంతో సరదాగా గడుపుతున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే ఈ ఖాళీ సమయాన్ని వినియోగించుకునేందుకు తన భార్య అనుష్క శర్మతో కలిసి ఉత్తరాఖండ్ వెకేషన్కు వెళ్ళాడు.
ఇక అక్కడ అందమైన ప్రదేశాలలో ఈ స్టార్ కపుల్స్ తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఆయా ప్రదేశాలలో ఈ స్టార్ కపుల్స్ ని చూసిన ఎంతోమంది అభిమానులు వీరితో ఫోటోలు దిగుతూ ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఉత్తరాఖండ్ వెకేషన్ లో భాగంగా విరాట్ కోహ్లీతో కొంతమంది అభిమానులు ఫోటోలు దిగి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయాయ్ అని చెప్పాలి.