రోహిత్ రేర్ రికార్డ్.. నెం.1 ప్లేసులో టీమిండియా ?

ఇక టెస్టు క్రికెట్‌లో టీమిండియా ఏకంగా నెంబర్‌వన్‌ స్థానాన్ని అధిరోహించింది. నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో విజయం సాధించడం ద్వారా ఏకంగా నాలుగు పాయింట్లు పొంది టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది.ప్రస్తుతం టీమిండియా ఖాతాలో మొత్తం 115 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికే వన్డే ఇంకా టి20 క్రికెట్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్న టీమిండియా తాజాగా టెస్టుల్లో కూడా అగ్రస్థానం అందుకుంది.అందువల్ల మూడు ఫార్మాట్లలో కూడా నెంబర్‌వన్‌గా నిలిచిన ఘనతను టీమిండియా సొంతం చేసుకుంది. మరోవైపు ఇండియాతో తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ పరాజయం చవిచూసిన ఆస్ట్రేలియా మొత్తం 111 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక తరువాత ఇంగ్లండ్‌ 106 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌ మొత్తం 100 పాయింట్లతో నాలుగు, సౌతాఫ్రికా 85 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. 


ఇక ఆసీస్‌తో మొదటి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా స్పిన్నర్లు అయిన రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌లు వికెట్ల వేటతో ఆసీస్‌ దారుణంగా ఓడిపోయింది.ఏకకాలంలో మూడు ఫార్మాట్స్‌లో కూడా టీమిండియా నెంబర్‌వన్‌ అవ్వడం ఇదే తొలిసారి. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఈ ఘనత అందుకోవడంతో హిట్‌మ్యాన్‌ ఖాతాలో ఈ అరుదైన రికార్డు వచ్చి చేరింది. టీమిండియాను అన్ని ఫార్మాట్లలో కూడా నెంబర్‌వన్‌గా నిలిపిన కెప్టెన్‌గా రోహిత్‌ చరిత్రకెక్కాడు. ఇంతకముందు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను గెలవడం ద్వారా టీమిండియా వన్డేల్లో కూడా నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా టి20 ర్యాంకింగ్స్‌లో కూడా టీమిండియా నెంబర్‌వన్‌గా అవతరించింది. అయితే ఈ సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా ఉన్నప్పటికీ.. అధికారికంగా మాత్రం ఈ మూడు ఫార్మాట్లకు రోహిత్‌ శర్మనే ఇంకా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: