ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైందంటే చాలు క్రికెట్స్ సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించి ఇక ఇప్పటికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయ్. ఇక ఇటీవల బీసీసీఐ ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సీజన్ కోసం అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మార్చ్ 31వ తేదీ నుంచి కూడా ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇక ఐపీఎల్ మ్యాచ్లు వస్తున్న సమయంలో సాధారణంగా ఇంట్లో ఉన్న ప్రేక్షకులు ఇక టీవీ ఆన్ చేసుకొని మ్యాచ్ వీక్షించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఏదో ఒక పని మీద బయటకు వెళ్లినవారు లేదా ఉద్యోగం చేసేందుకు వెళ్లినవారు.. ఇక ఐపీఎల్ మ్యాచ్ చూడాలని కొన్ని కొన్ని సార్లు ఆశపడుతూ ఉంటారు.. ఇలాంటి సమయంలో ఏదైనా ఒక ఓటీటి యాప్ను సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని కొన్ని డబ్బులు లేక ఇక ఇలాంటి సబ్క్క్రిప్షన్ చేసుకోరు కొంతమంది ప్రేక్షకులు. దీంతో ఐపీఎల్ మ్యాచ్లను మిస్ అవుతూ ఉంటారు. కానీ 2023 ఐపీఎల్ సీజన్ ని ప్రస్తుతం ఫ్రీగా చూసేందుకు అవకాశం ఉంది అన్న వార్త కాస్త ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి.


 మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను  జియో సినిమా స్ట్రీమింగ్ చేయనుంది. ఈ క్రమంలోనే జియో యూసర్లు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే మ్యాచ్ చూసేందుకు అవకాశం ఉంది. అహ్మదాబాద్, మొహాలీ, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, జైపూర్, ముంబై, గౌహతి, ధర్మశాల వేదికలు ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించబోతుంది బీసీసీఐ. అంతే కాదు ఈ సీజన్లో మొత్తం 18 రోజులపాటు రోజుకి రెండు మ్యాచ్లు జరగబోతున్నాయ్. అయితే ఫ్రీగా చూడవచ్చు అన్న వార్త తెలియడంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆనందంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl