ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే ఐపీఎల్ లో ఎలాంటి ప్రదర్శన అయితే చేస్తుందో ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా అలాంటి వైఫల్యాన్ని కొనసాగించింది అని చెప్పాలి. ఐపిఎల్ లో ఎలాగో కప్పు కొట్టే కల తీరలేదు. కనీసం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అయినా ఆ కల నెరవేరుతుందేమో అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు.


 కానీ ఐపీఎల్ కు మించిన వైఫల్యాన్ని ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కొనసాగిస్తుంది బెంగళూరు జట్టు. స్మృతి మందాన కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న జట్టు ఎక్కడ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేక పోతుంది అని చెప్పాలి. జట్టులో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ కూడా ఇక ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయడం లేదు. వెరసి ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో వరుసగా ఆరు పరాజయాలను మూటగట్టుకుంది జట్టు. చివరికి ఎట్టకేలకు ఒక విజయం సాధించింది అని చెప్పాలి. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బెంగుళూరు జట్టు లీగ్ దశ నుంచి ఇంటి బాట పట్టే అవకాశం ఉంది.


 ఈ క్రమం లోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్ సి బి వరుస వైఫల్యాల తో అభిమానులను నిరాశ పరుస్తున్న సమయం లో అటు విరాట్ కోహ్లీ మాత్రం అండగా నిలిచాడు. మహిళల జట్టు లో స్ఫూర్తి నింపుతూ కోహ్లీ మాట్లాడాడు అని చెప్పాలి. నేను ఐపీఎల్ 15 ఏళ్లుగా ఆడుతున్న.. ఒక్కసారి కూడా టైటిల్ గెలవ లేదు. కానీ ఎప్పుడూ నేను నిరుత్సాహపడలేదు. అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో ఆలోచించాలి. వైఫల్యాల నుంచి బయటపడేందుకు కనీసం ఒక్క శాతం అయినా ఛాన్స్ ఉంటుంది అంటూ విరాట్ కోహ్లీ మహిళా ప్లేయర్లలో ధైర్యాన్ని నింపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: