హరితేజ సినినటిగా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.అటు సినిమాల్లో నటిస్తునే వ్యాఖ్యాతగా నటిస్తూనే బుల్లితెరలోను తన సత్తా చాటుకుంటుంది.బిగ్ బాస్ తొలి సీజన్లో పాల్గొని ఫైనల్ వరకు వచ్చింది.ఆమె స్వతహాగా కూచిపూడి నృత్యకారిణి. హరితేజ 'ఆడువారి మాటలకు అర్దాలే వేరులే'తో వెండితెరపై అడుగుపెట్టిన హరితేజ అప్పటి నుండి వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షక ఆదరణ పొందింది.


తను బిగ్ బాస్ లో చెప్పిన హరికథకి అప్పటి వ్యాఖ్యాత జూనియర్ ఎన్.టి.ఆర్ సైతం అబినందనలు తెలియచేశారు.తను ఇలాంటి టాలెంట్ చూడలేదని కొనియాడారు.అస్సలు ఆ టాలెంట్ చూసే బిగ్ బాస్ లో ప్రేక్షకులు తనని హౌసులో కొనసాగించారని అందరు అంటారు.బిగ్ బాస్ సీజన్లో తను విన్నర్గా నిలుస్తుందని అందరు అనుకున్నారు.కాని తను రన్నర్ అప్ గా సరి పెట్టుకోవలసి వచ్చింది.


బిగ్ బాస్ సీజన్ నుండి బయటికి వచ్చాకా హరి తేజకు అవకాశాలు వెల్లువెత్తాయి.అటు సినిమాలు,ఇంకా వ్యాఖ్యాతగా చేస్తూ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకున్న వాళ్ళలో హరితేజ పేరు ముందు వరుసలోఉంటుంది.రీసెంట్గా ఒక బిడ్డకి తల్లి ఐన హరితేజ తన అమ్మ తనాన్ని ఎంజాయ్ చేస్తూ తన వర్క్ కి బ్రేక్ తీసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ నుండి బయటికి వచ్చాకా హరి తేజ సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొంటున్నారు.తనకి ప్రేగెన్సిలో కరోనా వచ్చిందని,తన కన్న బిడ్డను తాను ఎత్తుకోలేదని హరితేజ పెట్టిన పోస్టు అప్పటిలో వైరల్గా మారింది.ఇప్పుడు హరితేజ కొత్తగా తన యు ట్యూబ్ చానల్ ను ప్రారంభించబోతున్నారు.దానికి సంబందించి ఒక పాటను కూడా రూపొoదిoచారు.దీనిని సింగర్ సాకేత్ సంగీతం అందిచగా స్వయంగా హరితేజ ఆలపించారు.హరితేజ  "హరికథలు" అనే ఈ పాట ఇప్పుడు యు ట్యూబ్ చానల్లో చక్కర్లు కొడుతుంది.ఈ పాటచూసిన  అందరూ వెల్ కమ్ బ్యాక్ అని విషెస్ ని తెలియజేస్తున్నారు.అప్పటిలో సాదారణ వ్యక్తులు మాత్రమే పెట్టె యు ట్యూబ్ చానల్ ను ఇప్పుడు సెలేబ్రేటిలు,యాంకర్లు కూడా మొదలు పెడుతున్నారు.హరితేజ ఇందులో కూడా విజయం సాదించాలని తన ఫాన్స్  కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tv