ప్రస్తుతం రెడ్మి టీవీలు షియోమి హోం మార్కెట్ అయిన చైనాలో అమ్మకాలు సాగిస్తున్నారు. ఎంఐ బ్రాండ్తో పోలిస్తే యువ ప్రేక్షకులే లక్ష్యంగా రెడ్మి టీవీ అత్యాధునిక ఫీచర్లతో రానుందని షియోమి ఎగ్జిక్యూటివ్ ప్రకటించిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడటం గమనార్హం. టీవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొనే విధంగా ఈ టీవీని మార్కెట్ లోకి తీసుకొస్తున్న విషయాన్ని ఈశ్వర్ నీలకంఠన్ పేర్కొన్నారు. ఇక చైనా మార్కెట్లో గతనెల రెడ్మి మ్యాక్స్ 86 ఇంచుల అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ టీవీని రెడ్మీ కే 40 సిరీస్తో పాటు లాంఛ్ చేసింది. రెడ్మి మ్యాక్స్ అల్ట్రా హెచ్డీ (4కే) టీవీ రూ 91,000కు అందుబాటులో ఉంది.