ఈ మధ్య కాలంలో నటులు, స్టూడెంట్లు మరియు సాఫ్ట్ వేర్ ఉద్యోగులూ ఇలా చాలామంది పచ్చబొట్లు (టాటూలు) వేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక మరీ ముఖ్యంగా హీరోయిన్లు పచ్చబొట్లు వేసుకోవడం కొత్తేమీ కాకపొయినా వారు వేసుకునే శరీర ప్రాంతాలను బట్టి వారు చర్చల్లో నిలుస్తారు. నిజానికి ఈ టాటూలు వారికి ఫ్యాషన్. శరీరాన్ని దాచుకునే చోట టాటూలు వేసుకుని వాటిని బయటపెడుతూ ఉంటారు. శృతిహాసన్, త్రిష, నయనతార, సిమ్రన్, తాప్సీ, సమంత అక్కినేని, సంజన గల్రానీ, నమిత, అనసూయ.. ఇలా చాలా మంది నటీమణులు శరీరంపై టాటూలు వేయించుకున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చే నటి పూనమ్ కౌర్ కూడా ఇలానే టాటూలు వేయించుకున్నారు.



పూనమ్ కౌర్ తన ఎదపై చిన్న త్రిశూలం, నాగుపాము టాటూలను వేయించుకున్నారు. అంతేకాదు, ఆ టాటూలను చూపిస్తూ కొన్ని సెల్ఫీలు తీసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు, గుండెలో త్రిశూలం ఉన్నప్పుడు.. అది ఓం నమఃశివాయ అంటుందని కూడా పేర్కొన్నారు. త్రిశూలం, శేషనాగు.. ఇవి శివుడికి సంకేతాలు. ప్రస్తుతం కార్తీకమాసం నడుస్తోంది. అందుకే, శివుడిపై భక్తితో పూనమ్ కౌర్ ఈ టాటూలు వేయించుకున్నారు. అయితే, ఆమె ఎదపై వేయించుకోవడం చర్చనీయాంశం అయ్యింది. పూనమ్ కౌర్ అభిమానులు కొంత మంది టాటూలు చాలా బాగున్నాయని కొనియాడుతుంటే.. మరికొంత మంది మాత్రం పూనమ్‌పై మండిపడుతున్నారు. పవిత్రమైన త్రిశూలం టాటూను ఎదపై వేయించుకుంటావా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అయితే మరి గుండెలో పవన్ కళ్యాణ్ ఉంటే అంటూ వెటకారం చేస్తున్నారు. ఏదేమైనా పూనమ్ టాటూ సెల్ఫీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ‘ఒక ‘వి’చిత్రం’, ‘శౌర్యం’, ‘నాగవల్లి’, ‘గగనం’, ‘అటాక్’, ‘నాయకి’ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పూనమ్ కౌర్ చివరిగా 2018లో వచ్చిన ‘నెక్ట్స్ ఏంటి’ సినిమాలో కనిపించారు. నెటిజన్ల కామెంట్లపై మరి పూనం ఎలా స్పందిస్తుందో చూడాలి.






మరింత సమాచారం తెలుసుకోండి: