పిల్లి విద్యుత్ పరికరాలపైకి ఎక్కిందని, దాని వల్ల సాంకేతిక లోపం ఏర్పడిందని MSEDCL విడుదల చేసింది. అయితే పిల్లి చనిపోయింది. పింప్రి చించ్వాడ్లోని భోసారి, అకుర్డి మరియు పరిసర ప్రాంతాలలో ఉదయం 6 గంటలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం 2 గంటలకు విద్యుత్ సరఫరా తిరిగి ప్రారంభ మైంది. బుధవారం ఉదయం భోసారిలోని ట్రాన్స్ఫార్మర్లోని 22 కేవీ యార్డ్లోకి పిల్లి ప్రవేశించింది. దీని తరువాత భోసారి, అకుర్డి మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని MSEDCL అధికారి తెలిపారు.
పిల్లి విద్యుత్ పరికరాలపైకి ఎక్కిందని, దాని వల్ల సాంకేతిక లోపం ఏర్పడిందని MSEDCL విడుదల చేసింది. అయితే పిల్లి చనిపోయింది. విద్యుత్తు అంతరాయం కనీసం 60,000 మంది వినియోగదారులను ప్రభావితం చేసింది. ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉపకేంద్రాలను వినియోగించుకుని అధికారులు కృషి చేయడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు అధికారి తెలిపారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చేయడంతో పిల్ల ఇంత పని చేసిందా అంటూ నెటిజన్లు ఎవరి స్టైల్లో వారు కామెంట్లు చేస్తూ ఉన్నారు.