ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా ఎండలు మండి పోతున్నాయి.. సూర్యుడు వేడికి అందరు మాడి పోతున్నారు. గతంలో కన్నా కూడా ఎక్కువగా ఎండలు   తీవ్రతను చూపుతున్నాయి.. అయితే కరోనా కన్న కూడా ఎక్కువగా ఈ ఎండల వేడి నుంచి తట్టుకోవడానికి జాగ్రత్తలు చెబుతున్నారు..సూర్యుడు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాడు. సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరు ఎండకు అల్లాడి పోతున్నారు.. ఉదయం 9 దాటిన తర్వాత బయటకు రావడానికి జనాలు భయంతో వణికి పోతున్నారు.ఇప్పటికే ప్రజలు తమ ఇళ్లలో కూలర్ లు, ఫ్రిజ్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. షాపులలో కూడా మినికూలర్లు, ఏసీలను ఉపయోగిస్తున్నారు..


అత్యవసర పరిస్థితులలో బయటకు వెళితే థప్పనిసరిగా నీరు ఎక్కువగా ఉన్న పానీయాలను సేవించమని చెబుతున్నారు. ముఖ్యంగా కొబ్బరి బొండం,పుచ్చకాయలు, జ్యూస్ లు ప్రజలు తీసుకుంటున్నారు. ఇక కొందరు ఎండ ఎంత తీవ్రంగా ఉందో ప్రజలకు వెరైటీగా తెలియజేస్తున్నారు. ఇప్పటికే రోడ్డుపై ఆమ్లేట్ లు వేయడం వంటి వీడియోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే..మొన్నామధ్య రోడ్డు పై వడియాలు కూడా పెట్టిన వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే..


తాజాగా ఇప్పుడు మరో వీడియో వైరల్ అయ్యింది..40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోతున్నాయి. ఎండవేడిమికి మనుషులతో పాటు, నోరులేని మూగజీవాలు కూడా విలవిల్లాడి పోతున్నాయి. అయితే, ఇక్కడ ఒక మహిళ తమ ప్రాంతంలో ఉన్న ఎండ వేడిమి గురించి వినూత్నంగా చెప్పాలనుకుంది.. నార్త్ ప్రాంతాలలో ఎండ వేడిమి కాస్త ఎక్కువగా వుంటుంది. అందులో ఒడిశా లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి.సోనేపూర్ లో ఒక మహిళ తాము.. ఎదుర్కొంటున్న హీట్ ను వెరైటీగా తెలిపింది. సాధారణంగ చపాతీని చేసి.. దాన్ని గ్యాస్, పోయ్యి మీద కాలుస్తారు. అయితే,ఆమె ఒక కారులో మీద చపాతిని కాల్చింది. అట్ల కర్ర తీసుకుని, కారు ముందు భాగంలో చపాతీని కాల్చింది.మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: