కారులో షికారు పోదామా.. అంటూ చాలా మంది అనుకుంటారు. కొత్త కొత్త కార్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. అయితే వాటిలో ఎటువంటి కారును కొనాలి అనేది మాత్రం జనాలను పిచ్చెక్కిస్తుంది. అలాంటి వాళ్ళు తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ఫీచర్లు ఉన్న కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రైతుల కష్టాలు దేశం నలుమూలల ఉన్న వాళ్ళను కదిలించి వేస్తుంది. అయితే వారి కష్టాలను చూసి చాలా మంది వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు.


ఇలా మనకు అన్నం పెట్టే రైతన్నలు మాత్రం అప్పుల బాధలతో తనువు చాలిస్తున్నారు. వీరి గురించి మనం పెద్దగా ఆలోచించం. ఇంకా చెప్పాలంటే వారితో రూ.5కు రూ.10కు బేరం అడుతుంటాం. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. కార్ల గురించి. ఒక కారు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో.. దాన్ని కంపెనీలు ఏ రేటుకు అమ్ముతాయో తెలిస్తే షాక్ అవుతారు. కారు తయారు చేయడానికి కావలసిన ఖర్చు తో పోలిస్తే అమ్మే ఖర్చులో చాలా వ్యత్యాసం ఉంటుంది. వాటి వివరాలను ఒకసారి పరిశీలిస్తే..


రూ.లక్ష ఖర్చు అవుతుందని భావిస్తే.. కంపెనీ దాన్ని రూ.1.75 లక్షల నుంచి రూ.2.25 లక్షలకు విక్రయిస్తాయి. కంపెనీలు కారు విక్రయించడానికి 75 నుంచి 125 శాతం మార్జిన్ తీసుకుంటాయి.కొన్ని సందర్భాల్లో మార్జిన్ 200 శాతంగా కూడా ఉండొచ్చు. ఎందుకంత ఎక్కువ రేటుకు కంపెనీలు కార్లను విక్రయిస్తున్నాయని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. కార్ల తయారీలో 60 శాతం స్టీల్ అవసరం అవుతుంది.ఈ ధరల్లో ఒడిదుడుకులు ఉంటాయి. అందుకే కంపెనీలు ఎక్కువ మార్జిన్ పెట్టుకుంటాయి. ఇంతటితో అయిపోలేదు. కార్ల కంపెనీలు వీటి కార్లను మళ్లీ డీలర్ల వద్దకు చేర్చుతాయి.కారు కొన్న తర్వాత ఆర్‌టీవో, ఇన్సూరెన్స్, ఎక్స్‌ట్రా యాక్ససిరీస్ వంటి వాటికి మరింత డబ్బులు పెట్టుకోవాలి. అంటే ఇక్కడ కార్ల కంపెనీలు, డీలర్లు, ప్రభుత్వం ఇలా ఎవ్వరూ కూడా నష్టపోవడానికి ఇష్టపడరు. అది రైతులకు ,కారుకు ఉన్న వ్యత్యాసం..
.

మరింత సమాచారం తెలుసుకోండి: