ఆటో కోనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గొప్ప అవకాశం..పియాజియో కొత్త ఆటోలను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇవి ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌. అది కూడా డీజిల్‌ కొట్టించాల్సిన అవసరం లేదు. వీటిన ఎఫ్‌ఎక్స్‌ రేంజ్‌లలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. 9.5 కిలోవాట్స్‌ పవర్‌ట్రైన్‌తో ఫుల్లీ మెటల్‌ బాడీ వీటి ప్రత్యేకత.ఆటో ఆరుఅడుగుల బాడీ వస్తుంది. వీటిల్లో బ్లూవిజన్‌ హెడ్‌ ల్యాంప్స్, డ్యూయల్‌ టోన్‌ సీట్లు వంటి పలురకాల ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.అంతేకాకుండా ఈ కొత్త ఆటోలు కొనుగోలు చేసిన వారికి ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి.


ఆటో కొన్న తర్వాత మూడేళ్ల వరకు వారెంటి ఉంటుంది.. అంతేకాదు లక్ష కిలో మీటర్లు వాడేంత వరకు గ్యారెంటీ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. వీటితో . 3 ఏళ్లు ఉచిత మెయింటెనెన్స్‌ ప్యాకేజీ కూడా లభిస్తుంది.పియాజియో ఐకనెక్ట్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉంటుంది.కంపెనీ వీటిని ఎఫ్ఎక్స్ శ్రేణి కింద మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఎఫ్ఎక్స్ అంటే ఫిక్స్‌డ్ బ్యాటరీ అని అర్థం. ఈ ఆటోలు ప్యాసింజర్, కార్గో ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త పియాజియో అప్పి ఎక్స్‌ట్రా ఎఫ్ఎక్స్‌లో 9.5 కిలోవాట్ పవర్‌ట్రైన్ ఉంటుంది. ఫుల్లీ మెటల్ బాడీ వీటి ప్రత్యేకత...


ఆటోకు ఆరు అడుగుల బాడీ వస్తుంది. వీటిల్లో బ్లూవిజన్ హెడ్ ల్యాంప్స్, న్యూ బాడీ గ్రాఫిక్స్, కొత్త కలర్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, డ్యూయెల్ టోన్ సీట్స్ ఇలా పలు రకాల ఫీచర్లు ఈ కొత్త ఆటోలలో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. హిల్ హోల్డ్ అసిస్ట్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, బూస్ట్ మోడ్, రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయని వివరించింది..ఎక్స్‌ట్రా ఎఫ్ఎక్స్ అనే కార్గో వెర్షన్ కొనుగోలు చేస్తే దీని ధర రూ.3.12 లక్షలుగా ఉంది. అదే ఈసిటీ ఎఫ్ఎక్స్ అనే ప్యాసింజర్ వెహికల్ కొనుగోలు చేస్తే ధర రూ.2.83 లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు..

మరింత సమాచారం తెలుసుకోండి: