తెలుగుదేశం పార్టీకి చెందిన వివాస్ప‌ద నేత‌, మాజీ విప్‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై మరో కేసు నమోదు అయింది. ఆయ‌న‌పై ఇప్ప‌టికే ప‌లు కేసులు న‌మోదు కావ‌డంతో రెండు నెల‌ల పాటు జైలు శిక్ష అనుభ‌వించి వ‌చ్చారు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉన్న చింత‌మ‌నేని మ‌ళ్లీ వ‌రుస‌గా ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీతో వార్త‌ల్లో ఉంటున్నారు. తాజాగా ఆయ‌న‌పై మ‌రో కేసు న‌మోదు అయ్యింది. పంచాయతీ ఎన్నికల్లో నిబంధలను ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా చింతమనేని ప్రభాకర్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ర్యాలీ నిర్వహించారు. ఆయనకు 41ఎ నోటీసులు అందజేసినట్లు పోలీసులు తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: