తెలుగుదేశం పార్టీ యువ నేత, రాఫ్తాడు ఇన్చార్జ్
పరిటాల శ్రీరాం పై కేసు నమోదయింది. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు పెట్టారు. ధర్మవరం నియోజకవర్గంలో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో
శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ శ్రీరాంపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జామియా మసీదు వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారని పోలీసులు అభియోగం నమోదు చేశారు. అక్కడ ఎన్నికల ప్రచారం... నిబంధనలకు విరుద్ధం అంటూ ఎన్నికల అధికారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.