కరోనా భారిన పడి చికిత్స పొందుతున్న ప్ర‌ముఖ టాలీవుడ్‌ నిర్మాత బండ్ల గణేష్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గ‌తేడాది క‌రోనాకు గురై కోలుకున్న బండ్ల ఇప్పుడు మ‌రోసారి క‌రోనా భారీన ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే రెండు రోజుల క్రితం జ్వరం, తదితర లక్షణాలు ఉండటంతో కోవిడ్‌ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అయితే బండ్ల ఆరోగ్యం విష‌మంగా ఉంద‌ని.. ఆయ‌న్ను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నార‌ని ర‌క‌ర‌కాల వ‌దంతులు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ఆయ‌న కోలుకున్నార‌న్న వార్త‌ల‌తో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు సంతోషం వ్య‌క్తం చేస్తున్నాయి. బండ్ల‌ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదిలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: