సి‌ఎం‌ జగన్ పై ఎప్పుడు తనదైన శైలిలో విరుచుకుపడే నారా లోకేష్ మరొకసారి ట్విట్టర్ లో సి‌ఎం జగన్ ఘాటు విమర్శలు చేశారు. " జగన్ రెడ్డి హత్య రాజకీయాలు మనుకోవాలంటూ ఆయన మండి పడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందిస్తూ .. " పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బెదిరింపులకు లొంగలేదని కర్నూలు జిల్లా ,కోడుమూరు నియోజకవర్గం, నిడ్జూరు గ్రామ టిడిపి నేత కురవ శ్రీనివాసులు గారిని అత్యంత కిరాతకంగా వైకాపా రౌడీలు హత్యచేసారు. టిడిపి కార్యకర్తలను హత్య చేయించి తాడేపల్లి కొంపలో రాక్షస ఆనందం పొందుతున్న జగన్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు. జగన్ రెడ్డి హత్యారాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నాను." అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: