కడప జిల్లా వైఎస్ వివేకా హత్య కేసును సీరియస్ గా తీసుకున్న సీబీఐ ఇప్పుడు వరుసగా అరెస్ట్ లను సీబీఐ బృందం కొనసాగిస్తోంది, మూడవ కీలక అనుమానితుడు ఎర్ర గంగిరెడ్డి ని రాత్రి అరెస్ట్ చేసి రిమ్స్ లో వైద్య పరీక్షలు కూడా సీబీఐ అధికారులు చేయించినట్టు చెబుతున్నారు. నేడు ఎర్ర గంగిరెడ్డి ని పులివెందుల కోర్టులో హాజరు పరచనున్న  సీబీఐ అధికారులు అతనిని కస్టడీకి కూడా ఇమ్మని కోరే అవకాశం ఉందని అంటున్నారు, ఇక ఇప్పటికే ఈ కేసులో  సునీల్ , ఉమాశంకర్ లు అరెస్ట్ కాగా ఇప్పుడు ఎర్ర గంగ రెడ్డి ది మూడవ అరెస్ట్ అని చెప్పవచ్చు. ఇక నాలుగవ అనుమానితుడు వివేకా డ్రైవర్ దస్తగిరి ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు, మరి చూడాలి ఏం జరగనుంది అనేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: