తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం కు ఐటీ సేవ‌ల‌ను ఉచితంగా ఇచ్చేందుకు రిల‌య‌న్స్ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ముందుకు వ‌చ్చింది. టీడీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వ‌ర్యంలో రిల‌య‌న్స్ జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్, టీటీడీ మ‌ద్య ఈ మేర‌కు ఒప్పందం కుదిరింది. త‌రుమ‌ల శ్రీ‌వారిపై అపార‌మైన భ‌క్తితో రిల‌య‌న్స్ జియో యాజ‌మాన్యం టీటీడీ ఐటీ విభాగానికి హార్డ్‌వేర్‌, ఇన్‌ప్రాస్ట్ర‌క్ష‌ర్, సాప్ట్‌వేర్‌ని పూర్తిగా ఉచితంగా అందించేందుకు ముందుకు వ‌చ్చింద‌ని చెప్పారు.

 శ్రీ‌వారి భ‌క్తుల‌కు అత్యాధునిక మొబైల్ యాప్ త‌యారు చేయ‌నున్న‌ట్టు జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ తెలిపింది. ఈ యాప్ ద్వారా టీటీడీకి సంబంధించిన అన్ని సేవ‌లు భ‌క్తుల‌కు అందుబాటులోకి వ‌స్తాయి. మ‌రోవైపు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను తిల‌కించేందుకు పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్నారు. ఇప్ప‌టికే స్వామివారికి  సింహవాహన సేవ ప్రారంభ‌మైంది. ప‌లువురు ప్ర‌ముఖులు  ఉద‌య‌మే శ్రీ‌వారిని ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: