మా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. జూబ్లిహిల్స్ ప‌బ్లిక్ స్కూల్ లో ప్ర‌త్యేక ఏర్పాట్ల న‌డుమ ఈ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అదేవిధంగా ఎటువంటి త‌గాదాలు త‌లెత్త‌కుండా పోలీసులు ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్త‌మవుతున్నారు. ఎన్నిక‌లకు సంబంధించి ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కే సంబంధిత ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డంతో ఈ ప్రాంతం అంతా పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. హీరో శ్రీ‌కాంత్, మోహ‌న్ బాబు తో పాటు చిరు, ప‌వ‌న్ ఇలా అంతా అక్క‌డికి చేరుకుని సంద‌డి చేశారు. ఈ ఎన్నిక‌లకు సంబంధించి మొద‌ట్నుంచి తార‌క్ వ‌స్తారా రారా? అన్న ఉత్కంఠత నెల‌కొని ఉంది. దీనిపై ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఎన్నిక‌ల్లో పాల్గొనేందుకు తాను ఇష్టంగా లేన‌ని, ఈ విష‌యం ఇదివ‌ర‌కే ఆయ‌న జీవిత‌తో చెప్పారని కొంద‌రు తార‌క్ స‌న్నిహితులు అంటున్నారు. మ‌రోవైపు బాబాయ్ బాల‌య్య వ‌చ్చి ఓటు వేసినందున తారక్ కూడా ఓటింగ్ లో పాల్గొంటార‌ని తెలుస్తోంది. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కూ పోలింగ్ జ‌ర‌గ‌నున్నందున ఏ నిమిషం అయిన ప‌రిణామాలు మార‌వ‌చ్చు. మ‌రోవైపు తార‌క్ ఆత్మీయుడు, ఆర్ ఆర్ ఆర్ హీరోల‌లో ఒక‌రైన రామ్ చ‌ర‌ణ్ స్వామి మాల ధార‌ణ‌లో ఉంటూనే, ఉద‌యం ఇంటికే వ‌చ్చి ఓటు వేసి వెళ్లారు. అక్క‌డున్న వారంద‌రినీ పేరు పేరునా ప‌ల‌క‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: