తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏడుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ చేసింది. 2018 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులకు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ లుగా పోస్టింగ్లు ఇచ్చారు. సి హెచ్ రూపేష్ కు జగిత్యాల  అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా అవకాశం కల్పించారు. అలాగే మంచిర్యాల ఏసీపీ గా పనిచేస్తున్న అఖిల్ మహాజన్ ను రామగుండం అడిషనల్ డిసిపి అడ్మిన్ గా పోస్టింగ్ ఇచ్చారు.


నికిత పంత్ కు సంగారెడ్డి అడిషనల్ ఎస్పి అడ్మిన్ గా పోస్టింగ్ ఇచ్చారు. బాలస్వామికి మెదక్ అడిషనల్ ఎస్పి అడ్మిన్ గా అవకాశం కల్పించారు. యోగేష్ కు మహబూబాబాద్ అడిషనల్ ఎస్పి అడ్మిన్ గా పోస్టింగ్ ఇచ్చారు. రితి రాజ్ కు సూర్యాపేట అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ips